ఢిల్లీలో ప్రారంభమైన సీఎం కెసిఆర్ దీక్ష
- April 11, 2022
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. దీక్షకు సీఎం కేసీఆర్, రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు కేసీఆర్ నివాళులర్పించారు.తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పుష్పాలు సమర్పించారు.
కేంద్రం యాసంగి ధాన్యం కొనాలనే డిమాండ్తో టీఆర్ఎస్ పార్టీ ఈ దీక్ష చేపట్టింది. ధాన్యం సేకరణలో ఒకే విధానం ఉండాలనే డిమాండ్తో ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి టీఆర్ఎస్ అల్టిమేటం ఇవ్వనుంది. దీక్ష వేదికగా టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరును మరింత తీవ్రం చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవాణి టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు..
- గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు రూ.50 లక్షల బహుమతి అందించిన సీఎం విజయ్!
- ఫిలిప్పీన్స్లో ఘోర భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత..
- రూ.1,511కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- మెటాలో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు
- FIFA వరల్డ్ కప్ 2026 ప్రసార ప్రణాళికలను ప్రకటించిన beIN స్పోర్ట్స్..!!
- రెండేళ్లలో 1.9 మిలియన్లకు చేరిన సౌదీ వాహన దిగుమతులు..!!
- అల్ అమెరాత్లో రెస్టారెంట్ అగ్నిప్రమాదం..!!
- విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!









