జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేసిన ఇమ్రాన్ ఖాన్
- April 11, 2022
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తాజా మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం మధ్యాహ్నం ఓ కీలక ప్రకటన చేశారు. పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యత్వానికి తనతో పాటు తన పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులంతా జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో త్వరలో జరగనున్న నూతన ప్రధాని ఎన్నికను బహిష్కరించనున్నట్లు పీటీఐ ఎంపీలు కాసేపటి క్రితం ప్రకటించారు.ఈ ప్రకటన వెలువడిన మరుక్షణమే ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామా ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయంతో ఏ సభలో అయితే తాను ప్రధాని పదవిని కోల్పోయారో..అదే సభకు ఇమ్రాన్ రాజీనామాను ప్రకటిస్తున్నట్టైంది.
కాగా, ఇవాళ జరిగిన పీటీఐ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాము అసెంబ్లీలో కూర్చోవద్దు అని నిర్ణయించామని, దేశాన్ని దోచుకున్నవారితో కలిసి పనిచేయలేమని ఇమ్రాన్ అన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









