జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేసిన ఇమ్రాన్ ఖాన్
- April 11, 2022
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తాజా మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం మధ్యాహ్నం ఓ కీలక ప్రకటన చేశారు. పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యత్వానికి తనతో పాటు తన పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులంతా జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో త్వరలో జరగనున్న నూతన ప్రధాని ఎన్నికను బహిష్కరించనున్నట్లు పీటీఐ ఎంపీలు కాసేపటి క్రితం ప్రకటించారు.ఈ ప్రకటన వెలువడిన మరుక్షణమే ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామా ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయంతో ఏ సభలో అయితే తాను ప్రధాని పదవిని కోల్పోయారో..అదే సభకు ఇమ్రాన్ రాజీనామాను ప్రకటిస్తున్నట్టైంది.
కాగా, ఇవాళ జరిగిన పీటీఐ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాము అసెంబ్లీలో కూర్చోవద్దు అని నిర్ణయించామని, దేశాన్ని దోచుకున్నవారితో కలిసి పనిచేయలేమని ఇమ్రాన్ అన్నారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









