తొలి మేడ్ ఇన్ ఇండియా కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ప్రయాణం నేడే
- April 12, 2022
తొలి కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ఏప్రిల్ 12 మంగళవారం నుంచి ప్రయాణం మొదలుపెట్టనుంది. 'మేడ్ ఇన్ ఇండియా' అని సగర్వంగా చెప్పుకోగలిగే.. ఈ సివిల్ డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల పట్టణాలకు విమాన కనెక్టివిటీని అందించనుంది. భారతీయ విమానయాన చరిత్రలో దీనిని రెడ్ లెటర్ డేగా అభివర్ణిస్తూ.. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య ప్రాంత వాయు కనెక్టివిటీని మరింత పెంచుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మొట్టమొదటి “మేడ్ ఇన్ ఇండియా” 17-సీటర్ డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని 5 మారుమూల పట్టణాలను అస్సాంలోని దిబ్రూఘర్కు అనుసంధానం చేస్తూ దాని తొలి సర్వీసును పూర్తి చేస్తుంది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల్లో ఎయిర్ కనెక్టివిటీని ప్రోత్సహించడానికి, అవసరమైతే ఎయిర్ కనెక్టివిటీ కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి “ఈశాన్య ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటీ, ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం (NER)” అనే పథకాన్ని ఆమోదించింది.
ఈ స్కీంలో భాగంగా.. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నార్త్ ఈస్టరన్ రీజియన్ లో ఎయిర్ కనెక్టివిటీ, ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు అప్రూవల్ ఇచ్చింది. సివిల్ కార్యకలాపాల కోసం భారతదేశంలో తయారుచేసిన విమానాలను నడిపే భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్థ, అస్సాంలోని మొదటి FTO (ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్) ప్రారంభోత్సవాన్ని నిర్వహించనుంది.

ఈ రెండు కార్యక్రమాలకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరవుతారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సీఎంలు హిమంత బిస్వా శర్మ, పెమా ఖండూ హాజరవనున్నారు.
HAL వర్గాల ప్రకారం, AC క్యాబిన్తో కూడిన 17-సీటర్ నాన్-ప్రెజర్డ్ డోర్నియర్ 228 పగలు, రాత్రి కార్యకలాపాలు చేయగలదు. తేలికపాటి రవాణా విమానం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ కనెక్టివిటీని సులభతరం చేస్తుందని అధికారులు అంటున్నారు.
ఈ రెండు విమానాలను గత గురువారం అలయన్స్ ఎయిర్కు అప్పగించారు. అందులో ఒకదానిని అలయన్స్ ఎయిర్కు సరికొత్త హబ్ అయిన దిబ్రూగర్ విమానాశ్రయానికి మార్చారు.
డోర్నియర్ నిజానికి ఒక జర్మన్ విమానం, ఇది 1990 తొలి నాళ్లలో భారతదేశం అంతటా 100కి పైగా విమానాశ్రయాలకు సేవలు అందించడానికి దీర్ఘకాలంగా పనిచేయని ప్రాంతీయ విమానయాన సంస్థ వాయుదూత్ కోసం ఏర్పాటుచేశారు.
1981లో, HAL తయారీదారుల నుంచి ప్రొడక్షన్ లైసెన్స్ను పొందగా.. కాన్పూర్ ఫెసిలిటీ సెంటర్లో 125 విమానాలను తయారుచేశారు. గతంలో ఉన్న మోడల్స్ కంటే మెరుగైన వెర్షన్ తో అడుగుపెడుతున్న డార్నియర్ 228 NG (న్యూ జనరేషన్) గత వెర్షన్ల కంటే చాలా ఇంప్రూవైజ్డ్ వెర్షన్ అని చెబుతున్నారు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









