ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష విజయవంతం: ఎమ్మెల్సీ కవిత
- April 12, 2022
న్యూ ఢిల్లీ: 24 గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్ళు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో తెలంగాణ రైతులతో కలిసి కొట్లాడుతామని కవిత తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అంతేకాదు, మోదీ ప్రభుత్వం రైతుల శక్తిని తక్కువగా అంచనా వేస్తోందన్న కవిత, ఢిల్లీలో తాము ధర్నా చేస్తుంటే, హైదరాబాద్ లో బీజేపీ దొంగ దీక్ష చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులకు పంటకు పెట్టిన కనీస ఖర్చు కూడా రావడం లేదని, అయినా క్రూరమైన బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస సానుభూతి కూడా లేదని కవిత మండిపడ్డారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు కవిత. రైతులందరికీ ఒకే దేశం- ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని కవిత పేర్కొన్నారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









