యూఏఈ లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
- April 12, 2022
రస్ అల్ ఖైమా: శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తెలుగు తరంగిణి, సంప్రదాయం మరియు ఇస్కాన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో యూఏఈ లోని రస్ అల్ ఖైమా నగరంలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన కూచిపూడి నృత్యాలు, ఇస్కాన్ బృంద చిన్నారుల రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత పారాయణాల నడుమ శ్రీరామ జన్మదిన వేడుకలు ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండువగా కొనసాగాయి. శ్రీ సీతారాముల పల్లకి సేవలో భక్తులందరూ పాల్గొని భక్తి పారవశ్యంతో పులకరించారు.

పానకం, వడపప్పు, కమ్మని విందు భోజనాలతో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకున్న ఈ కార్యక్రమానికి యూఏఈ లోని వివిధ ఏమిరేట్స్ నుండి ఇస్కాన్ భక్త బృందాలు, భక్తులు సుమారు 3,000 వేలకు మందికి పైగా హాజరు అయ్యారు.
తెలుగు తరంగిణి అద్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్, సంప్రదాయం ధర్మరాజ మురారిదాస్ ప్రభు ల ఆధ్వర్యంలో సభ్యులు అందరు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా సహకారాన్ని అందించింది.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







