యూఏఈ లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
- April 12, 2022
రస్ అల్ ఖైమా: శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తెలుగు తరంగిణి, సంప్రదాయం మరియు ఇస్కాన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో యూఏఈ లోని రస్ అల్ ఖైమా నగరంలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన కూచిపూడి నృత్యాలు, ఇస్కాన్ బృంద చిన్నారుల రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత పారాయణాల నడుమ శ్రీరామ జన్మదిన వేడుకలు ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండువగా కొనసాగాయి. శ్రీ సీతారాముల పల్లకి సేవలో భక్తులందరూ పాల్గొని భక్తి పారవశ్యంతో పులకరించారు.

పానకం, వడపప్పు, కమ్మని విందు భోజనాలతో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకున్న ఈ కార్యక్రమానికి యూఏఈ లోని వివిధ ఏమిరేట్స్ నుండి ఇస్కాన్ భక్త బృందాలు, భక్తులు సుమారు 3,000 వేలకు మందికి పైగా హాజరు అయ్యారు.
తెలుగు తరంగిణి అద్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్, సంప్రదాయం ధర్మరాజ మురారిదాస్ ప్రభు ల ఆధ్వర్యంలో సభ్యులు అందరు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా సహకారాన్ని అందించింది.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









