యూఏఈ లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
- April 12, 2022
రస్ అల్ ఖైమా: శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తెలుగు తరంగిణి, సంప్రదాయం మరియు ఇస్కాన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో యూఏఈ లోని రస్ అల్ ఖైమా నగరంలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన కూచిపూడి నృత్యాలు, ఇస్కాన్ బృంద చిన్నారుల రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత పారాయణాల నడుమ శ్రీరామ జన్మదిన వేడుకలు ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండువగా కొనసాగాయి. శ్రీ సీతారాముల పల్లకి సేవలో భక్తులందరూ పాల్గొని భక్తి పారవశ్యంతో పులకరించారు.

పానకం, వడపప్పు, కమ్మని విందు భోజనాలతో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకున్న ఈ కార్యక్రమానికి యూఏఈ లోని వివిధ ఏమిరేట్స్ నుండి ఇస్కాన్ భక్త బృందాలు, భక్తులు సుమారు 3,000 వేలకు మందికి పైగా హాజరు అయ్యారు.
తెలుగు తరంగిణి అద్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్, సంప్రదాయం ధర్మరాజ మురారిదాస్ ప్రభు ల ఆధ్వర్యంలో సభ్యులు అందరు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా సహకారాన్ని అందించింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







