తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!
- April 12, 2022
హైదరాబాద్: నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది.ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కేబినెట్లో నిర్ణయించిన విషయాల గురించి మీడియాకు వెల్లడించారు.ఈ సంధర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై మహా సంగ్రామం మొదలు పెడతామని వెల్లడించారు.ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కాలుకు వేస్తే మెడకు మెడకు వేస్తే కాలుకు వేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి మెదడు జ్ఞానం బుద్ధి ఉందా… సోమరిపోతు ల కేంద్రం వ్యవహరిస్తోంది కేసీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకి ఉన్న స్థాయి కేంద్రానికి లేదని ఆయన మండిపడ్డారు. మతం పేరు మీద గెలిచాం.. మాకు చేతకాదు అని చెప్పొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు.
బాయిల్డ్ రైస్ ఎగుమతి చేసి ఎగుమతి చేయలేదని అబద్ధం చెప్పారని, మాములు టైమ్ లో 67 కిలోల బియ్యం వస్తే ఎండ కాలం లో 35 కిలోలు వస్తుందన్నారు. ఆ డబ్బును కేంద్రం భరించాలి…. ఆహార భద్రత కేంద్రం బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో తెలివి తక్కువ ప్రభుత్వం ఉందని, పెట్రోల్ ధరలు కేంద్రం పెంచి… రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలా అని ప్రశ్నించారు. బలమైన కేంద్రము బలహీన రాష్ట్రం ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ అని.. ఇది ఫెడరల్ సిస్టమ్ కి వ్యతిరేకమని కేసీఆర్ ధ్వజమెత్తారు.
తాజా వార్తలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి









