తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!
- April 12, 2022
హైదరాబాద్: నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది.ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కేబినెట్లో నిర్ణయించిన విషయాల గురించి మీడియాకు వెల్లడించారు.ఈ సంధర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై మహా సంగ్రామం మొదలు పెడతామని వెల్లడించారు.ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కాలుకు వేస్తే మెడకు మెడకు వేస్తే కాలుకు వేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి మెదడు జ్ఞానం బుద్ధి ఉందా… సోమరిపోతు ల కేంద్రం వ్యవహరిస్తోంది కేసీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకి ఉన్న స్థాయి కేంద్రానికి లేదని ఆయన మండిపడ్డారు. మతం పేరు మీద గెలిచాం.. మాకు చేతకాదు అని చెప్పొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు.
బాయిల్డ్ రైస్ ఎగుమతి చేసి ఎగుమతి చేయలేదని అబద్ధం చెప్పారని, మాములు టైమ్ లో 67 కిలోల బియ్యం వస్తే ఎండ కాలం లో 35 కిలోలు వస్తుందన్నారు. ఆ డబ్బును కేంద్రం భరించాలి…. ఆహార భద్రత కేంద్రం బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో తెలివి తక్కువ ప్రభుత్వం ఉందని, పెట్రోల్ ధరలు కేంద్రం పెంచి… రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలా అని ప్రశ్నించారు. బలమైన కేంద్రము బలహీన రాష్ట్రం ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ అని.. ఇది ఫెడరల్ సిస్టమ్ కి వ్యతిరేకమని కేసీఆర్ ధ్వజమెత్తారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







