తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!
- April 12, 2022
హైదరాబాద్: నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది.ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కేబినెట్లో నిర్ణయించిన విషయాల గురించి మీడియాకు వెల్లడించారు.ఈ సంధర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై మహా సంగ్రామం మొదలు పెడతామని వెల్లడించారు.ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కాలుకు వేస్తే మెడకు మెడకు వేస్తే కాలుకు వేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి మెదడు జ్ఞానం బుద్ధి ఉందా… సోమరిపోతు ల కేంద్రం వ్యవహరిస్తోంది కేసీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకి ఉన్న స్థాయి కేంద్రానికి లేదని ఆయన మండిపడ్డారు. మతం పేరు మీద గెలిచాం.. మాకు చేతకాదు అని చెప్పొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు.
బాయిల్డ్ రైస్ ఎగుమతి చేసి ఎగుమతి చేయలేదని అబద్ధం చెప్పారని, మాములు టైమ్ లో 67 కిలోల బియ్యం వస్తే ఎండ కాలం లో 35 కిలోలు వస్తుందన్నారు. ఆ డబ్బును కేంద్రం భరించాలి…. ఆహార భద్రత కేంద్రం బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో తెలివి తక్కువ ప్రభుత్వం ఉందని, పెట్రోల్ ధరలు కేంద్రం పెంచి… రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలా అని ప్రశ్నించారు. బలమైన కేంద్రము బలహీన రాష్ట్రం ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ అని.. ఇది ఫెడరల్ సిస్టమ్ కి వ్యతిరేకమని కేసీఆర్ ధ్వజమెత్తారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







