హత్య కేసులో 4 ఆసియా జాతీయులకి ఏడేళ్ళ జైలు శిక్ష
- April 13, 2022దుబాయ్: ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో విభేదాల కారణంగా ఓ వ్యక్తి, ఓ మహిళను హత్య చేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి సాయం తీసుకున్నాడు హంతకుడు. మృతురాలికీ, హంతకుడి స్నేహితుడికీ మధ్య ఆర్థిక వివాదమే ఈ హత్యకు కారణం. దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ కేసులో దోషులకు ఏడేళ్ళ కారాగార శిక్ష విధించింది. వారికి 200,000 దిర్హాముల జరీమానా విధించడంతోపాటు, శిక్షా కాలం ముగిశాక వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది న్యాయస్థానం. గత ఏడాది ఆగస్టులో ఈ హత్య జరిగింది. అల్ నఖీల్ ప్రాంతంలో ఆసియా జాతీయురాలైన ఓ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 200 దిర్హాముల గురించి జరిగిన గొడవ హత్యకు దారి తీసింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు