పుట్టగొడుగులు తిని 13 మంది మృతి
- April 13, 2022
అసోం: అసోంలో విషాద ఘటన చోటుచేసుకుంది.అడవిలో దొరికే విషపూరితమైన పుట్టగొడుగులు తిని 13 మంది చనిపోయారు.మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 39 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈ ఘటనలో మృత్యువాత పడ్డ వారంతా తేయాకు కార్మికులుగా అధికారులు గుర్తించారు.రాష్ట్రంలో ఎగువ జిల్లాలైన చరైడియో, దిబ్రూఘర్, శివసాగర్, టిన్సుకియా ప్రాంతాల్లో పుట్టగొడుగులు తిన్న వ్యక్తులు అస్వస్థతకు గురైనట్లు అసోం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత డిహింగియా తెలిపారు. ఐదు రోజుల్లో 35 మంది ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
35 మందిలో 13 మంది చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.అందులో నలుగురు సోమవారం, తొమ్మిదిమంది మంగళవారం చనిపోయారని తెలిపారు.మృతి చెందిన వారిలో చరైడియా జిల్లాలోని సోనారి ప్రాంతానికి చెందిన చిన్నారి కూడా ఉంది.అలాగే దిబ్రూఘర్ జిల్లాలో బార్బరువా ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉన్నారు. అదేవిధంగా శివసాగర్ జిల్లాలకు చెందిన వ్యక్తి ఒకరున్నారు అని తెలిపారు. వీరంతా కూడా అడవిలో దొరికే విషపూరితమైన పుట్ట గొడుగులను తినడం వల్ల ఇలా జరిగిందని, వాటిని తిన్నాక అందరిలో కడుపునొప్పి, వాంతులు, వికారం మొదలై ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!