ఒలెక్ట్రా గ్రీన్టెక్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్ సక్సెస్
- April 15, 2022
హైదరాబాద్: ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ (OLECTRA) తన ఉత్పత్తి పోర్ట్ఫోలియోను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ను శుక్రవారం నాడు విజయవంతంగా ప్రారంభించింది.ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామి, మార్కెట్ లీడర్గా ఉన్న ఒలెక్ట్రా ట్రక్కుల తయారీకి శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా రూపొందించిందే ఈ అంతర్నిర్మిత హెవీ-డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్.ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది,సింగిల్ ఛార్జితో 220 కి.మీ. ప్రయాణం చేయవచ్చు.ఈ టిప్పర్ 25 శాతం డ్యూటీ బోగీ సస్పెన్షన్ గ్రేడబిలిటీ (ఎత్తైన రోడ్లూ, ఘాట్ రోడ్లు) కూడా కలిగి ఉంటుంది.త్వరలో హైదరాబాద్ శివార్లలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ మాట్లాడుతూ, "భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రగామిగా ఉన్న,ఒలెక్ట్రా ఇప్పుడు హెవీ డ్యూటీ టిప్పర్ ట్రయల్స్ను ప్రారంభించింది.భారతదేశంలో ఈ రకమైన ట్రక్ ఇదే మొదటిది కావడం గర్వకారణం.పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటం తో,ఎలక్ట్రిక్ ట్రక్కులు ఈ రంగంలో గేమ్-ఛేంజర్గా మారతాయి.ఈ టిప్పర్ పనితీరు అద్భుతంగా, సమర్థవంతంగా ఉంటుంది.ఒలెక్ట్రా దీన్ని సాధ్యం చేసింది.ఇంతకు ముందు వాగ్దానం చేసినట్లు, మేము కలను సాకారం చేస్తున్నాం'' అన్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









