ఐపీఎల్ 2022: హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం..
- April 16, 2022
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ 15 టీ20 లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా కోల్ కతాపై నెగ్గి హ్యాట్రిక్ విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్ట గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 176 పరుగుల టార్గెట్ ను హైదరాబాద్ ఛేదించింది. మరో 13 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది.
తొలుత కోల్ కతా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా.. హైదరాబాద్ జట్టు 17.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేసేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి, మార్ క్రమ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. త్రిపాఠి 37 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. మార్ క్రమ్ 36 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. త్రిపాఠి స్కోర్ లో ఏకంగా 6 భారీ సిక్సులు ఉన్నాయి. 4 ఫోర్లు ఉన్నాయి. మార్ క్రమ్ స్కోర్ లో 4 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. హైదరాబాద్ జట్టులో కేన్ విలియమ్సన్ 17, అభిషేక్ శర్మ 3, నికోలస్ పూరన్ 5* పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెస్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచింది. కోల్ కతా జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది.
కోల్ కతా బ్యాటర్లలో నితీశ్ రాణా హాఫ్ సెంచరీతో మెరిశాడు. రాణా 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 2 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. రసెల్ (49*), కెప్టెన్ శ్రేయస్ (28) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్, జాన్సెన్, సుచిత్ తలో వికెట్ తీశారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీస్తూ కోల్కతా బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో హైదరాబాద్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. అయితే ఆఖర్లో ఆండ్రూ రస్సెల్ రెచ్చిపోయాడు. దూకుడుగా ఆడటంతో కోల్కతా మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించింది. రస్సెల్ 25 బంతుల్లోనే 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 4 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.
స్కోర్ల వివరాలు…
కోల్ కతా నైట్ రైడర్స్ – 175/8(20 ఓవర్లు)
సన్ రైజర్స్ హైదరాబాద్ – 176/3 (17.5 ఓవర్లు)
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









