కాబూల్లో బాంబు పేలుళ్లు.. 25 మంది విద్యార్థులు మృతి!
- April 19, 2022
కాబూల్:పశ్చిమ కాబూల్లో వరుస బాంబు పేలుళ్లు అలజడి సృష్టించాయి. హైస్కూళ్లే లక్ష్యంగా మూడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి.మంగళవారం ఏప్రిల్ 19న స్కూళ్ల వద్ద జరిగిన పేలుళ్ల ఘటనలో కనీసం 25 మంది విద్యార్థులు దుర్మరణం చెందినట్టు సమాచారం. ఈ మేరకు అప్ఘాన్ భద్రతా ఆరోగ్య అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.డజన్ల కొద్దీ గాయపడ్డారని తెలిపారు. పశ్చిమ కాబూల్లోని ముంతాజ్ పాఠశాల వద్ద తొలి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
రాజధానిలోని దష్త్-ఎ-బర్చి జిల్లాలోని పాఠశాల సమీపంలో రెండో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మరో ఆరుగురు మరణించారని, డజన్ల కొద్దీ జనం గాయపడ్డారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పేలుళ్లలో కనీసం నలుగురు మరణించారని, 14 మంది గాయపడ్డారని ఆసుపత్రి నర్సింగ్ విభాగం అధిపతి ఒకరు తెలిపారు.
పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో షియా హజారా కమ్యూనిటీకి చెందిన చాలా మంది నివాసితులు ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్తో సహా సున్నీ మిలిటెంట్ గ్రూపులు తరచుగా వీరిపై దాడులకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం జరిగిన ఈ మూడు బాంబు పేలుళ్లలో భారీగా ప్రాణనష్టం జరిగిందని కాబూల్ కమాండర్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ అన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









