నాలుగు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులపై దర్యాప్తు ప్రారంభం
- April 21, 2022
మనామా: మత్తుపదార్థాలు నింపిన 585 క్యాప్సూళ్లను తమ పేగుల్లోకి చొప్పించి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్న నలుగురు ఆసియన్లపై యాంటీ డ్రగ్ డైరెక్టరేట్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నాలుగు నోటిఫికేషన్లు అందాయని ముహర్రాక్ పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ ప్రకటించారు. అనుమానిత ఆసియన్లను బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. నోటిఫికేషన్లు అందిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక్కో సంఘటనపై విడివిడిగా విచారణ ప్రారంభించింది. ఇది సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో నిందితులను విచారించింది. విచారణ పెండింగ్ ఉన్న వారిని కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. ఘటనలపై ముమ్మరంగా విచారణ జరపాలని, స్వాధీనం చేసుకున్న వస్తువులను పరిశీలించేందుకు నిపుణులను నియమించాలని ఆదేశించింది. నేర పరిధిని గుర్తించడం, విదేశాల్లో ఉన్న అనుమానితులను చేరుకోవడం, వారిపై అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం విచారణలు కొనసాగుతున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చీఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







