రమదాన్ చివరి పదిరోజులకు భద్రతా సన్నాహాలు పూర్తి
- April 21, 2022
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో చివరి పది రోజులకు సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ యంత్రాంగంతో సహా భద్రతా విధానాలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కట్టుదిట్టం చేసింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్-జనరల్ షేక్ అహ్మద్ అల్-నవాఫ్ సూచనల మేరకు మినిస్ట్రీ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రమదాన్ చివరి పదిరోజులకు సంబంధించి భద్రతా, ట్రాఫిక్ చర్యలను మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మస్జీదులు, మార్కెట్లు, వాణిజ్య సముదాయాల చుట్టూ భద్రతను అందించడం సమగ్ర భద్రతా ప్రణాళిక లక్ష్యం. దీంతోపాటు పదిరోజుల్లో ప్రధాన రహదారులు, కూడళ్లలో ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాహనదారులు, రహదారి వినియోగదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ జామ్లను తగ్గించడానికి, మస్జీదులకు భక్తుల రాకను సులభతరం చేయడానికి, కియామ్ ప్రార్థనను సమర్థవంతంగా నిర్వహించడానికి సూచనలు, ట్రాఫిక్ చట్టాలను పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు. మస్జీదులలో లేదా షాపింగ్ చేసేటప్పుడు తమ వాహనాల లోపల విలువైన వస్తువులను ఉంచవద్దని అధికారులు పౌరులకు, నివాసితులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









