టీడీపీ సంచలన ప్రకటన..సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా
- April 21, 2022
అమరావతి: తెలుగుదేశం పార్టీ గుడ్ న్యూస్ తెలిపింది. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నేడు ఏపీలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భాంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటన చేసి ఆనందం నింపారు. ఈసారి ఆన్లైన్లో సభ్యత్వం తీసుకునే విధానాన్ని తెలుగుదేశం అందుబాటులోకి తెచ్చింది.వాట్సప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ల ద్వారా సభ్యత్వం పొందే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే సభ్యత్వం ఉన్నవారు పునరుద్ధరించుకోవచ్చు. 9858175175 నెంబర్కు వాట్సాప్ నుంచి హాయ్ అని సందేశం పంపిస్తే.. నమోదు ప్రక్రియ మొదలవుతుంది.రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లోనూ సభ్యత్వ నమోదు, లేదా పునరుద్ధరణ చేసుకోవచ్చని తెలుగుదేశం నాయకులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









