టీడీపీ సంచలన ప్రకటన..సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా

- April 21, 2022 , by Maagulf
టీడీపీ సంచలన ప్రకటన..సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా

అమరావతి: తెలుగుదేశం పార్టీ గుడ్ న్యూస్ తెలిపింది. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నేడు ఏపీలోని ఎన్టీఆర్ భవన్​లో పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భాంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటన చేసి ఆనందం నింపారు. ఈసారి ఆన్​లైన్​లో సభ్యత్వం తీసుకునే విధానాన్ని తెలుగుదేశం అందుబాటులోకి తెచ్చింది.వాట్సప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్​ల ద్వారా సభ్యత్వం పొందే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే సభ్యత్వం ఉన్నవారు పునరుద్ధరించుకోవచ్చు. 9858175175 నెంబర్​కు వాట్సాప్ నుంచి హాయ్ అని సందేశం పంపిస్తే.. నమోదు ప్రక్రియ మొదలవుతుంది.రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లోనూ సభ్యత్వ నమోదు, లేదా పునరుద్ధరణ చేసుకోవచ్చని తెలుగుదేశం నాయకులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com