నాయిని క్రికెట్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన టి.హోంమంత్రి

- April 23, 2022 , by Maagulf
నాయిని క్రికెట్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన టి.హోంమంత్రి

హైదరాబాద్: నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ మెమోరియల్ క్రికెట్ లీగ్ పోస్టర్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ శనివారం నాడు ఆవిష్కరించారు.దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.విన్నర్ ప్రైజ్ లక్ష రూపాయల గాను రన్నర్ ఆప్ ప్రైజ్ 50000 గాను బహుమతి అందజేస్తామని తెలియజేశారు.వచ్చే నెల 4వ తేదీన ప్రారంభిస్తామని ఫైనల్ మ్యాచ్ 8వ తేదీన నిర్వహిస్తారని వివరించారు. ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు సిద్దిక్, కార్తిక్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com