రంజాన్ తోఫా లను పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

- April 25, 2022 , by Maagulf
రంజాన్ తోఫా లను పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: నిరుపేద ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి తో కలిసి మేయర్ అంబర్ పేట్ లో నిరుపేద ముస్లిం లకు తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాల పండుగలు గౌరవించి నిరుపేదలు పండుగలు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనేది సీఎం ఉద్దేశ్యం అన్నారు.  

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్, అంబర్ పేట్, ఇందిరా నగర్ ప్రాంతంలో  మేయర్ రంజాన్  పండుగ  తోఫా లను పంపిణీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com