సౌదీలో దేశీయ విమాన ఛార్జీల్లో మార్పులు!
- April 27, 2022
రియాద్: దేశీయ విమాన ప్రయాణ టిక్కెట్ల ధరలలో మార్పులను ఎదుర్కోవటానికి అనేక చర్యలు తీసుకున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ప్రకటించింది. ఇటీవల కొన్ని కేటగిరీలో విమాన టిక్కెట్ల ధరల్లో మార్పును గమనించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. దేశీయ విమాన టిక్కెట్ల ధరలలో మార్పుల గురించి ప్రచారం అవుతున్న వార్తలను గమనిస్తున్నట్లు తెలిపింది. రాజ్యంలో పౌర విమానయాన రంగాన్ని రెగ్యులేటర్ హోదాలో పరిశీలన చేస్తున్నామని, విమాన కంపెనీల ధరల ప్యాకేజీలను గమనిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే విమాన రవాణా ధరలను సమీక్షించడంతో పాటు సీట్ల సామర్థ్యంలో పెరుగుదల, విమానాల సంఖ్యపై కూడా దృష్టి సారించినట్లు వెల్లడించింది. ప్రయాణీకులకు తగిన ధరలను నిర్ణయించడం, వాయు రవాణా రంగంలో పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు GACA పేర్కొంది. ప్రయాణీకుల హక్కులు, వారి రక్షణకు తమ మొదటి ప్రాధాన్యత కొనసాగుతుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







