సౌదీలో దేశీయ విమాన ఛార్జీల్లో మార్పులు!
- April 27, 2022
రియాద్: దేశీయ విమాన ప్రయాణ టిక్కెట్ల ధరలలో మార్పులను ఎదుర్కోవటానికి అనేక చర్యలు తీసుకున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ప్రకటించింది. ఇటీవల కొన్ని కేటగిరీలో విమాన టిక్కెట్ల ధరల్లో మార్పును గమనించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. దేశీయ విమాన టిక్కెట్ల ధరలలో మార్పుల గురించి ప్రచారం అవుతున్న వార్తలను గమనిస్తున్నట్లు తెలిపింది. రాజ్యంలో పౌర విమానయాన రంగాన్ని రెగ్యులేటర్ హోదాలో పరిశీలన చేస్తున్నామని, విమాన కంపెనీల ధరల ప్యాకేజీలను గమనిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే విమాన రవాణా ధరలను సమీక్షించడంతో పాటు సీట్ల సామర్థ్యంలో పెరుగుదల, విమానాల సంఖ్యపై కూడా దృష్టి సారించినట్లు వెల్లడించింది. ప్రయాణీకులకు తగిన ధరలను నిర్ణయించడం, వాయు రవాణా రంగంలో పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు GACA పేర్కొంది. ప్రయాణీకుల హక్కులు, వారి రక్షణకు తమ మొదటి ప్రాధాన్యత కొనసాగుతుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







