బలూచ్ ఆర్మీ దెబ్బ.. గట్టి వార్నింగ్ ఇచ్చిన చైనా
- April 27, 2022
చైనా: మన శత్రువు దేశం పాకిస్థాన్కు దాని మిత్ర దేశం చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం కరాచీ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు చనిపోగా అందులో ముగ్గురు చైనా పౌరులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో దాడిని ఖండిస్తూ చైనా దేశపు అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. పాక్లో ఉన్న చైనీయుల రక్షణ కోసం మరింత కృషి చేయాలని కోరింది. చైనీయుల వ్యాపారాలు, కార్యాలయాలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీని కట్టడి చేయాలని సూచించింది. అలాగే ఉగ్రవాద నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలని హితవు పలికింది.
ఇదిలా ఉండగా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ చైనాకు వార్నింగ్ ఇస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గ్వాదర్ పోర్టును విడిచి పెట్టి, బలూచిస్తాన్లో చైనా తమ కార్యకలాపాలను నిలిపివేయకుంటే మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించింది. కాగా, ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ ఉన్నత విద్యావంతురాలు. 30 ఏళ్ళ వయసున్న ఈమెకు ఇద్దరు పిల్లలు, భర్త వైద్యుడు. ఆమె ఇష్టప్రకారమే ఆత్మాహుతి దాడికి సిద్ధపడిందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







