తిరుపతి రుయా ఆసుపత్రి అంబులెన్స్ ల దందాపై స్పందించిన ఏపీ సీఎం జగన్
- April 27, 2022అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రిలో చనిపోయిన బాలుడి మృతదేహాన్ని తరలించే విషయంలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా సాగించిన దురాగతంపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. మంగళవారమే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ సీఎంను కలిసి ఘటన గురించి వివరించారు. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యుడిగా గుర్తిస్తూ ఆసుపత్రి సీఎస్ఆర్ఎంవోను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన అభిప్రాయపడ్దారు. ఇలాంటి చిన్నఘటనలే మొత్తం వ్యవస్థనే అప్రతిష్ట పాలు చేస్తాయని జగన్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు