తిరుపతి రుయా ఆసుపత్రి అంబులెన్స్ ల దందాపై స్పందించిన ఏపీ సీఎం జగన్
- April 27, 2022
అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రిలో చనిపోయిన బాలుడి మృతదేహాన్ని తరలించే విషయంలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా సాగించిన దురాగతంపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. మంగళవారమే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ సీఎంను కలిసి ఘటన గురించి వివరించారు. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యుడిగా గుర్తిస్తూ ఆసుపత్రి సీఎస్ఆర్ఎంవోను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన అభిప్రాయపడ్దారు. ఇలాంటి చిన్నఘటనలే మొత్తం వ్యవస్థనే అప్రతిష్ట పాలు చేస్తాయని జగన్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- FIFA వరల్డ్ కప్ 2026 ప్రసార ప్రణాళికలను ప్రకటించిన beIN స్పోర్ట్స్..!!
- రెండేళ్లలో 1.9 మిలియన్లకు చేరిన సౌదీ వాహన దిగుమతులు..!!
- అల్ అమెరాత్లో రెస్టారెంట్ అగ్నిప్రమాదం..!!
- విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!
- యూఏఈలో ఏళ్ల తరబడి చిక్కుకుపోయిన భారత మహిళ..ఎట్టకేలకు స్వదేశానికి..!!
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!









