వైజాగ్ లో స్టూడియో నిర్మించే యోచనలో బాలయ్య, చెర్రీ !
- April 05, 2016
తెలుగు సినీపరిశ్రమ చెన్నై నుంచి తరలి వచ్చాక హైదరాబాద్ లో అన్ని హంగులూ సమకూర్చుకొని ఇక్కడ స్థిరపడేందుకు దాదాపు 40 ఏళ్లు పట్టింది. విశాఖపట్నంలో స్థిరపడాలన్నా కొన్నేళ్లు పడుతుంది. హైదరాబాద్ లో సారథీ స్టూడియో, అన్నపూర్ణా, రామానాయుడు, పద్మాలయా, రామోజీ ఫిలింసిటీ వంటి అన్ని సదుపాయాలూ ఉన్న అద్భుతమైన సినీ స్టూడియోలు ఉన్నాయి.విశాఖపట్నాన్ని కూడా సినిమా రాజధానిగా తీర్చి దిద్దాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు. విశాఖను సినిమా నిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేయాలని అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. ఆయన కల ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. హీరోలు బాలకృష్ణ, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్ విశాఖపట్నంలో సినిమా స్టూడియోలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ ముగ్గురు నటులు విశాఖలో స్టూడియోలు నిర్మించే ఆలోచనలో ఉన్నారని, ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. ఇదంతా ఆచరణలోకి వస్తే ...విశాఖను మూవీ లాండ్ చేయాలన్న చంద్రబాబు నాయుడు కల ఫలించినట్టే మరి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







