కువైట్ లో అన్ని ఆంక్షలు తొలగింపు..
- April 28, 2022
కువైట్ సిటీ: కువైట్ కేబినేట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో విధించిన అన్ని ఆంక్షలను తొలగించింది. అయితే, మాస్క్ వేసుకోవడం అనేది అప్షనల్గా పేర్కొంది. ఏవైనా లక్షణాలు ఉంటే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని తెలిపింది. అలాగే ఇమ్యునైజేషన్ స్టేటస్, పీసీఆర్ టెస్టుతో సంబంధం లేకుండా అన్ని బహిరంగ ప్రదేశాల్లోకి వ్యక్తులను అనుమతించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే వ్యాక్సిన్ తీసుకోని వారిని పీసీఆర్ టెస్టుతో సంబంధం లేకుండా ఇన్సిట్యూషన్, కార్యాలయాల్లో అనుమతించాలని ఆదేశించింది.ఇక ఎవరైనా వైరస్ బారిన పడితే ఐదు రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని, అనంతరం బయటకు వచ్చిన తర్వాత మరో ఐదు రోజుల పాటు మాస్క్ ధరించాలని తెలిపింది. అటు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ 2022 మే 1(ఆదివారం) నుండి వ్యాక్సినేషన్తో సంబంధం లేకుండా విదేశాల నుండి వచ్చే వారందరికీ పీసీఆర్ పరీక్షను రద్దు చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







