కువైట్ లో అన్ని ఆంక్షలు తొలగింపు..
- April 28, 2022
కువైట్ సిటీ: కువైట్ కేబినేట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో విధించిన అన్ని ఆంక్షలను తొలగించింది. అయితే, మాస్క్ వేసుకోవడం అనేది అప్షనల్గా పేర్కొంది. ఏవైనా లక్షణాలు ఉంటే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని తెలిపింది. అలాగే ఇమ్యునైజేషన్ స్టేటస్, పీసీఆర్ టెస్టుతో సంబంధం లేకుండా అన్ని బహిరంగ ప్రదేశాల్లోకి వ్యక్తులను అనుమతించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే వ్యాక్సిన్ తీసుకోని వారిని పీసీఆర్ టెస్టుతో సంబంధం లేకుండా ఇన్సిట్యూషన్, కార్యాలయాల్లో అనుమతించాలని ఆదేశించింది.ఇక ఎవరైనా వైరస్ బారిన పడితే ఐదు రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని, అనంతరం బయటకు వచ్చిన తర్వాత మరో ఐదు రోజుల పాటు మాస్క్ ధరించాలని తెలిపింది. అటు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ 2022 మే 1(ఆదివారం) నుండి వ్యాక్సినేషన్తో సంబంధం లేకుండా విదేశాల నుండి వచ్చే వారందరికీ పీసీఆర్ పరీక్షను రద్దు చేసింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









