ఘనంగా ఇఫ్తార్ విందు
- April 30, 2022
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని27 April 2022న దుబాయ్ లోని వెస్ట్ జోన్ హోటల్ అపార్ట్మెంట్స్ నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ కి చెందిన షుమారు 150 (వ్యవస్థాపక, కార్యనిర్వాహక, సబ్ కమిటీ, సభ్యులు) మంది వరకు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ ప్రసంగాలలో తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యమాల గురించి వివరించారు.పవిత్ర రమదాన్ మాసంలో షుమారు 2,000 వేల మందికి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
యూఏఈ లో నివసిస్తున్న తెలుగు వారందరినీ సమన్వయపరచుకుంటూ "భిన్నత్వంలో ఏకత్వం" అనే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే మరెన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నామని కార్యక్రమంలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు ఉపవాస దీక్ష విరమణాంతర ప్రార్ధనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఇఫ్తార్ కార్యక్రమ నిర్వహణలో తెలుగు అసోసియేషన్ వైస్ చైర్మన్ మసియుద్దీన్ కీలక పాత్ర పోషించారు.అసోసియేషన్ సబ్ కమిటీ సభ్యులైన ఫహీం మరియు జాఫర్ ఆలి సహాయ సహకారములు అందించారు.

తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







