ఈద్ షాపింగ్.. ఆన్‌లైన్ మోసాలపై బహ్రెయిన్ హెచ్చరిక

- May 01, 2022 , by Maagulf
ఈద్ షాపింగ్.. ఆన్‌లైన్ మోసాలపై బహ్రెయిన్ హెచ్చరిక

బహ్రెయిన్: ఆన్‌లైన్‌లో ఈద్ షాపింగ్ చేయాలనే వినియోగదారులు ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ సైబర్ సెక్యూరిటీ విభాగం హెచ్చరించింది. అలాగే దుకాణందారులు సైతం స్కామర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచించారు. ఈద్ అల్ ఫితర్ సెలవుల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్‌ కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో వినియోగదారులు సురక్షితంగా ఎలా కొనుగోలు చేయాలనే దానిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ షాపింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఆకర్షణీయమైన ఆఫర్లను పున:సమీక్షించుకోని కొనుగోలు చేయాలని వినియోగదారులను సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com