ఉమ్రా యాత్రికులు సామాను నిబంధనలు పాటించండి: మంత్రిత్వ శాఖ
- May 01, 2022
జెడ్డా: ఉమ్రా యాత్రికులందరూ బయలుదేరే సమయంలో ప్రయాణ సామాను బరువుల నిబంధనలకు కట్టుబడి ఉండాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికులకు పిలుపునిచ్చింది. ప్రయాణించేటప్పుడు అనుమతించబడిన స్పెసిఫికేషన్లను నిర్ధారించడానికి, అలాగే పౌర విమానయాన జనరల్ అథారిటీ జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండటానికి అవసరమైనప్పుడు ఎయిర్లైన్ క్యారియర్తో కమ్యూనికేట్ కావాలని కోరింది. ఉమ్రా సందర్శకులు వారి విమాన సమయాల ఆధారంగా.. అనుమతించబడిన ప్రయాణ సామాను బరువుల గురించి వారికి అవగాహన కల్పించాలని సౌదీ ఉమ్రా కంపెనీలకు మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా ఉమ్రా యాత్రికులు డిపార్చర్ హాళ్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడంలో దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







