ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు..
- May 04, 2022
ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) లీగ్ సీజన్ 15 ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ లను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, ఈ సీజన్లో మ్యాచ్లన్నింటినీ మహారాష్ట్రలోని స్టేడియంలలోనే నిర్వహించనున్నట్లుగా బీసీసీఐ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ను కాస్తంత మారుస్తూ తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన చేశారు. ఈ ప్రకటన ప్రకారం ప్లే ఆఫ్ మ్యాచ్లను గుజరాత్లోని అహ్మదాబాద్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నిర్వహించనున్నారు.
ఐపీఎల్ తాజా సీజన్లో ప్లే ఆఫ్ దశ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ మంగళవారం ఈ ప్రకటన జారీ చేసింది. ఈ సీజన్లో ఈ నెల 29న జరగనున్న టైటిల్ పోరును అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అంతకు ముందే ఈ నెల 27న క్వాలిఫయర్ 2 మ్యాచ్నూ ఇక్కడే నిర్వహిస్తారు. ఇక కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ (మే 24)తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ (మే 25)ను నిర్వహిస్తారు.
మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభం అయ్యాయి. ముంబై, పుణె నగరాల్లోని నాలుగు మైదానాల్లో 65 రోజుల పాటు మ్యాచులు జరుగుతాయి. ఐపీఎల్ – 15వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్తో ఆరంభమైంది. వాంఖడే స్టేడియం వేదికగా మార్చి 26వ తేదీ శనివారం రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ జరిగింది. గత సీజన్లో ఈ రెండు జట్లు ఫైనల్కు వచ్చాయి. కేకేఆర్పై సీఎస్కే విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్లో మొత్తం పది జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్లను ఆడుతుంది. మార్చి 27వ తేదీ నుంచి డబుల్ హెడ్డర్ (రోజుకు రెండు మ్యాచ్లు) ప్రారంభం అయ్యాయి. వాంఖడే, డీవై పాటిల్, బ్రబౌర్న్, ఎంసీఏ మైదానాల్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. మార్చి 26న ప్రారంభమైన ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్లు మే 29న ఫైనల్ తో ముగుస్తాయి.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







