జీసీసీ ఐడీలతో ప్రయాణించడానికి అనుమతించిన ఖతార్
- May 04, 2022
ఖతార్: జీసీసీ దేశాలు జారీ చేసిన ఐడీలతో ప్రయాణించడానికి ఖతార్ అనుమతించింది. ఖతారీలు, జీసీసీ దేశాల పౌరులు దేశం, ఇతర జీసీసీ దేశాలకు వెళ్లి వచ్చేందుకు జీసీసీ ఐడీ కార్డులను ఉపయోగించవచ్చని ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లే ఖతార్ పౌరులు తాము ప్రయాణించాలనుకుంటున్న దేశాలకు సంబంధించిన ప్రయాణ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ వెసులుబాటు జీసీసీ దేశాల పౌరుల ప్రయాణాలను సులభతరం చేయనుందని పేర్కొంది. ఖతార్ దేశంలోకి ప్రవేశించడానికి రోగనిరోధక శక్తి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న జీసీసీ జాతీయులు, నివాసితులు, ఈయూ జాతీయులు, నివాసితులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నుండి మినహాయింపును ఇచ్చినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







