కువైట్ లో యజమాని, భార్యను చంపిన వ్యక్తిపై సీబీఐ కేసు నమోదు
- May 06, 2022
కువైట్ సిటీ: కువైట్లో తన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకొని, తన మత విశ్వాసానికి వ్యతిరేకంగా సున్తీ శస్త్రచికిత్స చేయించినందుకు కువైట్లో తన యజమానిని, అతని భార్యను చంపినందుకు భారతీయ వ్యక్తిపై భారత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బుధవారం కేసు నమోదు చేసింది. బాధితులు నిందితుడిని అడ్డుకునేందుకు అతడి పాస్పోర్టును ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, అతని మత విశ్వాసాలకు వ్యతిరేకంగా బలవంతంగా సున్తీ ఆపరేషన్ చేయించారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. 2012లో సంతోష్ కుమార్ రాణా అనే ఇండియన్ కువైట్ జాతీయులైన ఫహద్ బిన్ నాసర్ ఇబ్రహీం, అతని భార్య సలామా ఫరాజ్ సలేంను హత్య చేశాడు. అంతకు ముందు రాణా వీరి వద్ద పనిమనిషిగా పనిచేశాడు. హత్యానంతరం బాధితులకు చెందిన అల్మారాను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసి రాణా తన పాస్పోర్ట్ ను తీసుకుని ఇండియాకు పారిపోయినట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. నిందితుడు సంతోష్ కుమార్ రాణాను అప్పగించాలని కువైట్లోని అధికారులు చేసిన అభ్యర్థన మేరకు డిసెంబర్ 2016లో విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచన మేరకు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 29, 2012న నిందితుడు రాణా గైర్హాజరీలో కువైట్ స్టేట్ ఆఫ్ ఫస్ట్ కోర్ట్ మరణశిక్ష విధించింది. హత్య నేరానికి సంబంధించి సంతోష్ కుమార్ రాణాని అప్పగించాలని ఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







