భారత పౌరసత్వం వదులుకున్న ఏడున్నర లక్షల మంది పౌరులు
- May 06, 2022
న్యూ ఢిల్లీ: గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మంది పౌరులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2016 నుంచి ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు ఆరు వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2016-2021 వరకు గణాంకాల ఆధారంగా రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాల్ని వెల్లడించింది. ఈ డాటా ప్రకారం.. 7,49,765 మంది భారత్ విడిచిపెట్టి, 106 దేశాల్లో స్థిరపడ్డారు.
2019లో అత్యధికంగా 1.44 లక్షల మంది దేశం విడిచిపెట్టారు. 2016లో 1.41 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2020లో మాత్రం చాలా తక్కువ మంది దేశాన్ని వదిలి వెళ్లారు. విదేశాల్లో స్థిరపడ్డ వాళ్లలో దాదాపు 82 శాతం మంది అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకే వెళ్లారు. 2016-2021 మధ్యకాలంలో 2,174 మంది చైనాకు వలస వెళ్లారు. 2020-21లలో 31 మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని పాకిస్తాన్కు వలస వెళ్లారు.ఇక, భారత పౌరసత్వం పొందిన వాళ్లలో హిందువులతోపాటు, జైనులు, సిక్కులు, క్రిస్టియన్లు ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!









