‘మదర్స్ డే’ స్పెషల్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ
- May 07, 2022
హైదరాబాద్: తెలంగాణ లో సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికుల్లో సంతోషం నింపుతున్న టీఎస్ ఆర్టీసీ..తాజాగా ‘మదర్స్ డే’ స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది. ఆదివారం మాతృ దినోత్సవం సందర్భంగా వారికి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణించే తల్లులకు మాత్రమే ఈ అవకాశమిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
ఆర్టీసీ తాజా నిర్ణయంపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ… మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులకు కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలతో ప్రయాణించే తల్లులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏసీ సర్వీస్ సహా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
త్యాగమయి అమ్మ ప్రేమను, అనురాగాన్ని వెలకట్టలేమని… ఆ త్యాగమూర్తి సేవలను గుర్తిస్తూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని సజ్జనార్ వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ సామాజిక దృక్పథంతో ముందడుగు వేస్తోందని… ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే సందర్భంగా కూడా రాయితీలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవలే నిరుద్యోగ యువతకు బస్ పాసుల్లో రాయితీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







