మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించిన సౌదీ
- May 07, 2022
రియాద్: మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను సౌదీ అరేబియా ఆకర్షించింది. తొమ్మిది కొత్త ప్రాజెక్టుల ద్వారా మైనింగ్, ఖనిజాల రంగానికి 32 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం మంత్రిత్వ శాఖ లక్ష్యం అని సౌదీ పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ తెలిపారు. విదేశీ కంపెనీల నుండి ఖనిజ అన్వేషణ లైసెన్సుల కోసం ప్రస్తుతం వచ్చిన 145 దరఖాస్తులను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోందని అల్ఖోరాయెఫ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల 14,500 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. విజన్ 2030 ప్లాన్లో భాగంగా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టడం ద్వారా కింగ్డమ్ తన ఆర్థిక వ్యవస్థను చమురేతర రంగాలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







