మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించిన సౌదీ
- May 07, 2022రియాద్: మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను సౌదీ అరేబియా ఆకర్షించింది. తొమ్మిది కొత్త ప్రాజెక్టుల ద్వారా మైనింగ్, ఖనిజాల రంగానికి 32 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం మంత్రిత్వ శాఖ లక్ష్యం అని సౌదీ పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ తెలిపారు. విదేశీ కంపెనీల నుండి ఖనిజ అన్వేషణ లైసెన్సుల కోసం ప్రస్తుతం వచ్చిన 145 దరఖాస్తులను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోందని అల్ఖోరాయెఫ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల 14,500 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. విజన్ 2030 ప్లాన్లో భాగంగా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టడం ద్వారా కింగ్డమ్ తన ఆర్థిక వ్యవస్థను చమురేతర రంగాలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి