మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించిన సౌదీ
- May 07, 2022
రియాద్: మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను సౌదీ అరేబియా ఆకర్షించింది. తొమ్మిది కొత్త ప్రాజెక్టుల ద్వారా మైనింగ్, ఖనిజాల రంగానికి 32 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం మంత్రిత్వ శాఖ లక్ష్యం అని సౌదీ పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ తెలిపారు. విదేశీ కంపెనీల నుండి ఖనిజ అన్వేషణ లైసెన్సుల కోసం ప్రస్తుతం వచ్చిన 145 దరఖాస్తులను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోందని అల్ఖోరాయెఫ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల 14,500 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. విజన్ 2030 ప్లాన్లో భాగంగా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టడం ద్వారా కింగ్డమ్ తన ఆర్థిక వ్యవస్థను చమురేతర రంగాలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







