కార్మికుడికి 120,000 దిర్హాములు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశం

- May 07, 2022 , by Maagulf
కార్మికుడికి 120,000 దిర్హాములు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశం

అబుధాబి: అబుధాబి న్యాయస్థానం, ఓ సంస్థ తమ కార్మికుడికి 120,000 దిర్హాములు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. విల్లాలో కిటికీలు అమర్చుతుండగా ఎత్తయిన ప్రాంతం నుంచి కార్మికుడు కింద పడిపోయాడు. బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి శాశ్వత వైకల్యం సంభవించినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. గతంలో న్యాయస్థానం 40,000 దిర్హాములు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించగా, ఇప్పుడది 120,000 దిర్హాములకు పెరిగింది. నష్ట పరిహారాన్ని తగ్గించాల్సిందిగా సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com