బిగ్బాస్ కోసం బిందు మాధవి ఎంత ఖర్చు చేసిందో.!
- May 12, 2022బుల్లితెరపై మెగా రేంజ్ పాపులారిటీ వున్న బిగ్బాస్ రియాల్టీ షో ఇప్పుడు బుల్లితెర నుండి ఓటీటీ తెరకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఓటీటీలో బిగ్బాస్ నాన్స్టాప్ పేరుతో టెలికాస్ట్ అవుతున్న బిగ్బాస్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలిమెంట్గా మారింది.
ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న బిగ్బాస్ ఓటీటీకి కంటెస్టెంట్ బిందుమాధవి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. ఈమె పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇంత రచ్చ జరగడానికి బిందు మాధవి ఎంత ఖర్చు చేసిందా.? అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి.
గతంలో కౌషల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో బిగ్బాస్ రచ్చకు తెర లేచింది. ఆ తర్వాతి సీజన్లో అభిజిత్ బాగా ఖర్చు చేసి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అదే టైమ్లో అఖిల్ సార్ధక్ కూడా భారీ బడ్జెట్ ఉపయోగించి విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకునే ప్రయత్నం చేశాడు కానీ, వర్కవుట్ కాలేదు.
మళ్లీ ఓటీటీ బిగ్బాస్లో సైతం అఖిల్ సార్ధక్ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్స్గా వున్నాడు. బిందు మాధవి, అఖిల్ సార్ధక్ మధ్య వార్ ఒకింత గట్టిగానే నడుస్తోంది. టైటిల్ ఫేవర్ కంటెస్టెంట్లుగా వీరిద్దరినీ అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరూ ఇంతలా ట్రెండింగ్ అవడానికి ఎంత మొత్తంలో ఖర్చు చేసి వుంటారా.? అనేదే ఇప్పుడు నెట్టింటి చర్చ.
నో డౌట్.. ఇదేమీ ఆషా మాషీగా వచ్చే ఫాలోయింగ్ కానే కాదు. ఖచ్చితంగా పోటా పోటీగా ఖర్చు చేసే వుంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైతేనేం, బిగ్బాస్ రియాల్టీ షోకీ, ఆ షో టైటిల్ విన్నర్కీ వున్న కిక్కు వేరే లేవల్. ఆ కిక్కు దక్కించుకోవాలంటే ఆ రేంజ్లో పైసల్ పెట్టాల్సిందే.! ఎంత.? అని లెక్కేయలేం కానీ, బిందు మాధవి కూడా అదే చేసినట్లుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?