ఏటీఎమ్ 2022 ఎగ్జిబిషన్లో అత్యుత్తమంగా నిలిచిన బహ్రెయిన్
- May 13, 2022
బహ్రెయిన్: దుబాయ్లోని అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2022 ఎగ్జిబిషన్లో ఈ సంవత్సరం బహ్రెయిన్ అత్యత్తమంగా నిలిచింది. ఈ మేరకు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) ప్రకటించింది. బహ్రెయిన్ నేషనల్ పెవిలియన్ ద్వారా గురువారంతో ముగిసిన ఈ అంతర్జాతీయ టూరిజం ఈవెంట్లో పాల్గొన్న 158 పెవిలియన్లలో బహ్రెయిన్ పెవిలియన్ అతిపెద్దది. పెవిలియన్లో నేషనల్ ఎయిర్ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ నేతృత్వంలో 21 ఎగ్జిబిటర్లు పాల్గొన్నాయి. అలాగే హోటళ్లు, రిసార్ట్ లు, టూరిజం కంపెనీలు, టూర్ ఆపరేటర్లతో సహా అనేక ప్రసిద్ధ బహ్రెయిన్ పర్యాటక సౌకర్యాలను కల్పించారు. బహ్రెయిన్ పర్యాటక రంగాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి, నాగరికత, వైవిధ్యం, వారసత్వం, ఆధునికతను తెలియజేసేలా అనేక ప్రదర్శనలను బహ్రెయిన్ పెవిలియన్ లో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







