షేక్ ఖలీఫా మరణంపై సంతాపం తెలిపిన రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్

- May 14, 2022 , by Maagulf
షేక్ ఖలీఫా మరణంపై సంతాపం తెలిపిన రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్

జెడ్డా: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మరణంపై.. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి, అల్-నహ్యాన్ కుటుంబానికి, సోదర ఎమిరాటీ ప్రజలకు, అరబ్- ఇస్లామిక్ దేశాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ మరణ వార్త తెలిసిన వెంటనే కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ విచారంలో మునిగిపోయారని వారి కార్యాలయం తెలిపింది. తన ప్రజలకు, తన దేశానికి, ప్రపంచానికి చాలా అందించిన నాయకుడు షేక్ ఖలీఫా అంటూ తమ సందేశాల్లో వారు కొనియాడారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు క్రౌన్ ప్రిన్స్ ఫోన్ చేసి పరామర్శించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com