షేక్ ఖలీఫా మరణంపై సంతాపం తెలిపిన రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్
- May 14, 2022జెడ్డా: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మరణంపై.. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి, అల్-నహ్యాన్ కుటుంబానికి, సోదర ఎమిరాటీ ప్రజలకు, అరబ్- ఇస్లామిక్ దేశాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ మరణ వార్త తెలిసిన వెంటనే కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ విచారంలో మునిగిపోయారని వారి కార్యాలయం తెలిపింది. తన ప్రజలకు, తన దేశానికి, ప్రపంచానికి చాలా అందించిన నాయకుడు షేక్ ఖలీఫా అంటూ తమ సందేశాల్లో వారు కొనియాడారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు క్రౌన్ ప్రిన్స్ ఫోన్ చేసి పరామర్శించారు.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం