ఢిల్లీ,ముంబై, గోవాలో హై అలర్ట్..

- April 06, 2016 , by Maagulf
ఢిల్లీ,ముంబై, గోవాలో హై అలర్ట్..

జమ్ముకశ్మీర్ నుంచి భారత్‌లోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు పంజాబ్ నుంచి స్విఫ్ట్‌కారులో పయణిస్తున్నారనే నిఘా సంస్థల హెచ్చరించడంతో ఢిల్లీ, ముంబై, గోవాలో హై అలర్ట్ ప్రకటించారు. వారి టార్గెట్ ఈ మూడు నగరాలే కావొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నందున అక్కడ నిఘాను పటిష్ఠం చేశారు. పంజాబ్‌లోని ఓ స్థానికుడితో కలిసి స్విఫ్ట్‌కారు (నంబర్ జేకే-01, ఏబీ 2654)లో ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు పయణిస్తున్నట్లుగా నిఘా వర్గాలు సమాచారం. వారి వెంట భారీ పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయా మార్గాల్లో హైవేలపై పోలీసులు తనిఖీలు విస్తృతం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com