ఈ నెల 17 నుంచి కీవ్లో తిరిగి భారత ఎంబసీ కార్యకలాపాలు
- May 14, 2022కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశ రాజధాని కీవ్లో మూసివేసిన భారత రాయబార కార్యాలయం తిరిగి తెరుచుకోనున్నది.ఈ నెల 17 నుంచి భారత ఎంబసీని పునరుద్ధరించనున్నారు.భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొన్నది. ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై దాడిని రష్యా ప్రారంభించింది.రాజధాని కీవ్ స్వాధీనం కోసం ప్రయత్నించింది.బాంబులతో విరుచుకుపడింది.ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థులు, పౌరులను పొరుగు దేశాలకు, అక్కడి నుంచి భారత్కు తరలించారు.అనంతరం మార్చి 13 నుంచి ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం సేవలను పొలాండ్ రాజధాని వార్సా నుంచి కొనసాగించారు.
కాగా, మరోవైపు రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చింది. కీవ్ స్వాధీనంపై వెనక్కి తగ్గింది. మరియుపోల్ వంటి తీర ప్రాంత నగరాలపై దృష్టిసారించింది.ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయాన్ని పునరుద్ధరించాలని కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.‘వార్సా (పోలాండ్) నుండి తాత్కాలికంగా పనిచేస్తున్న ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం 17 మే నుంచి కీవ్లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది’ అని అందులో పేర్కొంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు