షేక్ మొహమ్మద్ హయాంలో మరింత పురోగతి: బహ్రెయిన్
- May 15, 2022
మనామా: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఎన్నిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అభివృద్ధి, పురోగతికి తొడ్పడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్-జయానీ అన్నారు. ఇది సంయుక్త గల్ఫ్, అరబ్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో యూఏఈ సమర్థవంతమైన విదేశాంగ విధానం కొనసాగింపుగా నిలుస్తుందన్నారు. బహ్రెయిన్-ఎమిరాటీ సంబంధాలు స్నేహపూర్వకత , పరస్పర గౌరవం, దృఢమైన పునాదుల ఆధారంగా పటిష్టమైన, విశిష్టమైన వ్యూహాత్మక భాగస్వామ్యం, మరింత స్థిరమైన సమీకృత విజయాల కొత్త శకం వైపు బలం, ఆశావాదంతో ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సును కొనసాగించాలని ఆకాంక్షిస్తూ తన దేశాన్ని జాతీయంగా, ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధించడంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విజయం సాధించే సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







