దివంగత యూఏఈ అధ్యక్షుడికి నివాళులు అర్పించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

- May 15, 2022 , by Maagulf
దివంగత యూఏఈ అధ్యక్షుడికి నివాళులు అర్పించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

 హైదరాబాద్: రెండ్రోజుల క్రితం కన్నుమూసిన యూఏఈ అధ్యక్షుడు, అబుధాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ సహ్యాన్ మృతిపట్ల భారత ప్రభుత్వం తరఫున అధికారికంగా సంతాపం తెలియజేసేందుకు  భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు అబుధాబి బయలుదేరారు.

యూఏఈలో ఈరోజు సాయంత్రం దివంగత యూఏఈ అధ్యక్షుడి స్మృతికి నివాళులు అర్పిస్తారు. అనంతరం యూఏఈ తదుపరి అధ్యక్షుడిగా నియమితులైన షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్ అల్‌ నహ్యాన్‌తోపాటు దివంగత అధ్యక్షుడి ఇతర కుటుంబ సభ్యులను ఉపరాష్ట్రపతి పరామర్శిస్తారు. భారత ప్రభుత్వం తరఫున వారికి సానుభూతిని తెలియజేస్తారు.

నాలుగు రోజుల పర్యటనకోసం ఉపరాష్ట్రపతి హైదరాబాద్ కు వచ్చిన సంగతి విదితమే.అయితే యూఏఈ అధ్యక్షుడి మృతి నేపథ్యంలో భారతదేశం తరఫున నివాళులు అర్పించేందుకు ఉపరాష్ట్రపతి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో యూఏఈకి బయలుదేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com