దివంగత యూఏఈ అధ్యక్షుడికి నివాళులు అర్పించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- May 15, 2022
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం కన్నుమూసిన యూఏఈ అధ్యక్షుడు, అబుధాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ సహ్యాన్ మృతిపట్ల భారత ప్రభుత్వం తరఫున అధికారికంగా సంతాపం తెలియజేసేందుకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అబుధాబి బయలుదేరారు.
యూఏఈలో ఈరోజు సాయంత్రం దివంగత యూఏఈ అధ్యక్షుడి స్మృతికి నివాళులు అర్పిస్తారు. అనంతరం యూఏఈ తదుపరి అధ్యక్షుడిగా నియమితులైన షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తోపాటు దివంగత అధ్యక్షుడి ఇతర కుటుంబ సభ్యులను ఉపరాష్ట్రపతి పరామర్శిస్తారు. భారత ప్రభుత్వం తరఫున వారికి సానుభూతిని తెలియజేస్తారు.
నాలుగు రోజుల పర్యటనకోసం ఉపరాష్ట్రపతి హైదరాబాద్ కు వచ్చిన సంగతి విదితమే.అయితే యూఏఈ అధ్యక్షుడి మృతి నేపథ్యంలో భారతదేశం తరఫున నివాళులు అర్పించేందుకు ఉపరాష్ట్రపతి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో యూఏఈకి బయలుదేరారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







