AED3.8Bకి తగ్గిన ‘ఎమిరేట్స్’ వార్షిక నష్టాలు
- May 16, 2022
దుబాయ్: కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ గ్రూప్ AED3.8 బిలియన్ ($1 బిలియన్) వార్షిక నష్టాన్ని నమోదు చేసింది. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గడం, ప్రయాణాలు తిరిగి ప్రారంభం కావడంతో ఎమిరెట్స్ వార్షిక నష్టాలు గత సంవత్సరం కంటే తగ్గాయని కంపెనీ నివేదిక తెలిపింది. గ్రూప్ గత సంవత్సరంలో AED22.1 బిలియన్ ($6 బిలియన్) నష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 2021-22 వార్షిక నివేదిక (మార్చి 31, 2022తో ముగిసే సంవత్సరానికి) లాభదాయకత, గణనీయమైన ఆదాయ మెరుగుదల, వ్యాపారాలలో బలమైన పునరుద్ధరణను చూపింది. గ్రూప్ ఆదాయం AED66.2 బిలియన్ ($18.1 బిలియన్), గత సంవత్సరం ఫలితాల కంటే 86% పెరుగుదల నమోదు చేసింది. గ్రూప్ నగదు నిల్వ AED25.8 బిలియన్లు ($7 బిలియన్లు), గత సంవత్సరం కంటే 30% పెరిగింది. 2021-22లో ఎమిరేట్స్ దుబాయ్ ప్రభుత్వం నుండి AED3.5 బిలియన్ల ($954 మిలియన్లు) మూలధన ఇంజెక్షన్ను అందుకుంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!







