AED3.8Bకి తగ్గిన ‘ఎమిరేట్స్’ వార్షిక నష్టాలు
- May 16, 2022
దుబాయ్: కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ గ్రూప్ AED3.8 బిలియన్ ($1 బిలియన్) వార్షిక నష్టాన్ని నమోదు చేసింది. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గడం, ప్రయాణాలు తిరిగి ప్రారంభం కావడంతో ఎమిరెట్స్ వార్షిక నష్టాలు గత సంవత్సరం కంటే తగ్గాయని కంపెనీ నివేదిక తెలిపింది. గ్రూప్ గత సంవత్సరంలో AED22.1 బిలియన్ ($6 బిలియన్) నష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 2021-22 వార్షిక నివేదిక (మార్చి 31, 2022తో ముగిసే సంవత్సరానికి) లాభదాయకత, గణనీయమైన ఆదాయ మెరుగుదల, వ్యాపారాలలో బలమైన పునరుద్ధరణను చూపింది. గ్రూప్ ఆదాయం AED66.2 బిలియన్ ($18.1 బిలియన్), గత సంవత్సరం ఫలితాల కంటే 86% పెరుగుదల నమోదు చేసింది. గ్రూప్ నగదు నిల్వ AED25.8 బిలియన్లు ($7 బిలియన్లు), గత సంవత్సరం కంటే 30% పెరిగింది. 2021-22లో ఎమిరేట్స్ దుబాయ్ ప్రభుత్వం నుండి AED3.5 బిలియన్ల ($954 మిలియన్లు) మూలధన ఇంజెక్షన్ను అందుకుంది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









