యూఏఈ అధ్యక్షుడికి సంతాపం తెలిపిన బీడీఎఫ్ చీఫ్

- May 16, 2022 , by Maagulf
యూఏఈ అధ్యక్షుడికి సంతాపం తెలిపిన బీడీఎఫ్ చీఫ్

అబుదాబి: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బీడీఎఫ్) కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను సందర్శించి షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు సంతాపం తెలిపారు.  దివంగత హెచ్‌హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ ఆత్మకు శాంతి చేకూరాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను బీడీఎఫ్ చీఫ్ ప్రార్థించారు. అల్-నహ్యాన్ కుటుంబం, యూఏఈ  ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "అరబ్, ఇస్లామిక్ దేశాల ప్రజలకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయాయి" అని తన సందేశంలో బీడీఎఫ్ చీఫ్ పేర్కొన్నారు.  బీడీఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్ వెంట పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com