యూఏఈ అధ్యక్షుడికి సంతాపం తెలిపిన బీడీఎఫ్ చీఫ్
- May 16, 2022
అబుదాబి: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బీడీఎఫ్) కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించి షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు సంతాపం తెలిపారు. దివంగత హెచ్హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ ఆత్మకు శాంతి చేకూరాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను బీడీఎఫ్ చీఫ్ ప్రార్థించారు. అల్-నహ్యాన్ కుటుంబం, యూఏఈ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "అరబ్, ఇస్లామిక్ దేశాల ప్రజలకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయాయి" అని తన సందేశంలో బీడీఎఫ్ చీఫ్ పేర్కొన్నారు. బీడీఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్ వెంట పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









