యూఏఈ అధ్యక్షుడికి సంతాపం తెలిపిన బీడీఎఫ్ చీఫ్
- May 16, 2022
అబుదాబి: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బీడీఎఫ్) కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించి షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు సంతాపం తెలిపారు. దివంగత హెచ్హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ ఆత్మకు శాంతి చేకూరాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను బీడీఎఫ్ చీఫ్ ప్రార్థించారు. అల్-నహ్యాన్ కుటుంబం, యూఏఈ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "అరబ్, ఇస్లామిక్ దేశాల ప్రజలకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయాయి" అని తన సందేశంలో బీడీఎఫ్ చీఫ్ పేర్కొన్నారు. బీడీఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్ వెంట పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







