ఈ నెల 21 వరకు తెలంగాణకు వర్ష సూచన
- May 18, 2022
హైదరాబాద్ : తెలంగాణలో ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఉత్తర-దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని తెలిపింది.
మరోవైపు తెలంగాణలోని 20 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైన, 5 జిల్లాల్లో 38 డిగ్రీలకు పైన, 3 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న రాత్రి అతి తక్కువగా మెదక్ జిల్లా కల్లకల్ లో 23.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో నిన్న 2.56 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









