ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ
- May 18, 2022న్యూ ఢిల్లీ: అనేక అంశాల్లో ఇండియాలోనూ శ్రీలంక వంటి పరిస్థితే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టి మళ్లించడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. వివిధ అంశాల్లో శ్రీలంకతో, ఇండియాను పోలుస్తూ రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, పెట్రోల్ ధరలు, మత హింస వంటి అంశాల్లో ఇండియా, శ్రీలంకను పోలి ఉందన్నారు. దీనికి సంబంధించిన గ్రాఫ్స్ను ఆయన ట్వీట్ చేశారు.
ప్రజల దృష్టి మరల్చడం ద్వారా వాస్తవాల్ని దాచలేరని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ, కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తూనే ఉంది. శ్రీలంకలో పెరిగిన ధరలు, నిరుద్యోగం కారణంగా ఆ దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన