తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన..

- May 18, 2022 , by Maagulf
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన..

న్యూ ఢిల్లీ: భారత ప్రధాని మోడీ ఈ నెల 26 న హైదరాబాద్ కు రాబోతున్నారు. హైదరాబాద్‌లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వార్షికోత్స‌వంలో మోదీ పాల్గొననున్నారు.అంతే కాకుండా రామ‌గుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల క‌ర్మాగారాన్ని కూడా ఆయ‌న హైద‌రాబాద్ నుంచే వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.జాతీయ పార్టీల నేతలంతా ప్రస్తుతం తెలంగాణ ఫై ఫోకస్ పెట్టారు. మొన్నటికి మొన్న జేపీ నడ్డా, రాహుల్‌ గాంధీ ఆ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణలో పర్యటించారు. ఇక ఇప్పుడు.. ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com