అబుధాబి బిగ్ టికెట్: ఇద్దరు భారతీయ మిత్రులకు జాక్పాట్..
- May 19, 2022
అబుధాబి: అబుధాబిలో ఇద్దరు భారత ప్రవాసులకు అబుధాబి బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో జాక్పాట్ తలిగింది.బుధవారం నిర్వహించిన బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో భారత్ కు చెందిన డియోన అన్నా బిను, షరీఫ్ పనిచాయిల్ ఏకంగా 500,000 దిర్హాములు గెలుచుకున్నారు.ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు కలిసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.069002కు ఈ జాక్పాట్ తగిలింది. వారిద్దరూ గడిచిన రెండేళ్ల నుంచి క్రమం తప్పకుండా బిగ్ టికెట్ రాఫెల్లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
పనిచాయిల్ అబుధాబిలోని ముస్సాఫాలో చిన్న కూరగాయల మార్కెట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే, తాను గెలిచిన భారీ నగదులో కొంత భాగం తన కూరగాయల బిజినెస్ను విస్తరించడంలో వినియోగిస్తానని తెలిపాడు. మరో విజేత బిను మాట్లాడుతూ చాలా రోజులుగా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో తనకు భారీ మొత్తం చేతికి వస్తుండడం ఆనందంగా ఉందన్నాడు. తాను కూడా అబుధాబిలో కూరగాయల వ్యాపారం మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్









