అబుధాబి బిగ్ టికెట్: ఇద్దరు భారతీయ మిత్రులకు జాక్‌పాట్..

- May 19, 2022 , by Maagulf
అబుధాబి బిగ్ టికెట్: ఇద్దరు భారతీయ మిత్రులకు జాక్‌పాట్..

అబుధాబి: అబుధాబిలో ఇద్దరు భారత ప్రవాసులకు అబుధాబి బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో  జాక్‌పాట్ తలిగింది.బుధవారం నిర్వహించిన బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో భారత్ కు చెందిన డియోన అన్నా బిను, షరీఫ్ పనిచాయిల్ ఏకంగా 500,000 దిర్హాములు గెలుచుకున్నారు.ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు కలిసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.069002కు ఈ జాక్‌పాట్ తగిలింది. వారిద్దరూ గడిచిన రెండేళ్ల నుంచి క్రమం తప్పకుండా బిగ్ టికెట్ రాఫెల్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 

పనిచాయిల్ అబుధాబిలోని ముస్సాఫాలో చిన్న కూరగాయల మార్కెట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే, తాను గెలిచిన భారీ నగదులో కొంత భాగం తన కూరగాయల బిజినెస్‌ను విస్తరించడంలో వినియోగిస్తానని తెలిపాడు. మరో విజేత బిను మాట్లాడుతూ చాలా రోజులుగా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో తనకు భారీ మొత్తం చేతికి వస్తుండడం ఆనందంగా ఉందన్నాడు. తాను కూడా అబుధాబిలో కూరగాయల వ్యాపారం మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com