ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీ
- May 21, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ మోతీబాగ్లోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించారు. అక్కడి విద్యా విధానం గురించి అరవింద్ కేజ్రీవాల్ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్ తిలకించారు. పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం సీఎం బృందం పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించింది.
కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ, పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు కేజ్రీవాల్. స్కూల్ సందర్శన తర్వాత మహమ్మద్పూర్లోని మోహల్లా క్లినిక్ను కేసీఆర్ సందర్శించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం మోహల్లా క్లినిక్స్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది.
ఇక, శనివారం మధ్యాహ్నం సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ సమావేశమయ్యారు.దాదాపు రెండున్నర గంటల పాటు ఇద్దరు నేతలు జాతీయ అంశాలతో పాటు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై చర్చించారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







