ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీ
- May 21, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ మోతీబాగ్లోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించారు. అక్కడి విద్యా విధానం గురించి అరవింద్ కేజ్రీవాల్ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్ తిలకించారు. పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం సీఎం బృందం పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించింది.
కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ, పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు కేజ్రీవాల్. స్కూల్ సందర్శన తర్వాత మహమ్మద్పూర్లోని మోహల్లా క్లినిక్ను కేసీఆర్ సందర్శించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం మోహల్లా క్లినిక్స్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది.
ఇక, శనివారం మధ్యాహ్నం సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ సమావేశమయ్యారు.దాదాపు రెండున్నర గంటల పాటు ఇద్దరు నేతలు జాతీయ అంశాలతో పాటు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై చర్చించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







