రామ్గోపాల్వర్మ కంపెనీ నీ అమితాబ్ సందర్శించారు..
- April 07, 2016
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ కంపెనీ అనే పేరుతో ఓ ఆఫీసును ఏర్పాటు చేశారు. దీన్ని బాలీవుడ్ షహెన్షా అమితాబ్ సందర్శించారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. సర్కార్ తన ఆఫీసుకు రావడం అద్భుతమైన క్షణమని ట్వీట్ చేశారు. దీంతోపాటు అమితాబ్ ఆఫీసుకు వచ్చినప్పుడు తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కంపెనీ లోపలికి వచ్చిన అమితాబ్కు వర్మ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి గది తిరుగుతూ మొత్తం ఆఫీసును చూపించారు.
రామ్గోపాల్వర్మ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ దర్శకులు పూరీ జగన్నాథ్, కోనా వెంకట్, సుధీర్ వర్మ, నటుడు బ్రహ్మాజీ తదితరులు సోషల్మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్మ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







