హారన్ మోగిందో ఇక చాలాన్ పడినట్టే.. హైదరాబాద్లో కొత్త రూల్స్
- May 23, 2022
హైదరాబాద్: హైదరాబాద్ సిటీని శబ్దకాలుష్యం నుంచి విముక్తి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. అధిక శబ్దాలు, ఒళ్లు జలదరించే హారన్లు వినియోగించే వారిపై కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989 కింద రూ.1000 జరిమానాతోపాటు కేసు నమోదు చేయనున్నారు. ఈ మేరకు జూన్ 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈనెల 10వ తేదీ నుంచి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీ శబ్దాలు వచ్చే 3,320 హారన్లను కూడా రిమూవ్ చేశారు. వాహన కంపెనీ తయారు చేసిన హారన్ కాకుండా ఇతర హారన్లు ఉపయోగిస్తే అట్లాంటి వారిపై కేసు నమోదుతో పాటు చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు. హారన్తోపాటు సైరన్ ఉపయోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







