సమంత-విజయ్ దేవరకొండ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదు
- May 24, 2022
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంతలు షూటింగ్లో గాయపడినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం "ఖుషి". శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుంటే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ను ఇటీవలే కాశ్మీర్లో పూర్తి చేసుకుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది.
ఇందులో విజయ్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్, సమంతలు గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. కాశ్మీరులోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నపుడు వీరిద్దరూ లిడ్డర్ నదిలో పడిపోయారని, దీంతో వారికి స్వల్పంగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి.
వీటిని చిత్ర బృందం తోసిపుచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. టీం అంతా కాశ్మీరులో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని విజయవంతంగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నట్టు తెలిపింది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దని కోరింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని పేర్కొంది.
Fake news alert :"There are few reports that #VijayDeverakonda and #Samantha were injured while shooting for #Kushi movie.There is no truth in this news.
— BA Raju's Team (@baraju_SuperHit) May 24, 2022
The entire team returned to Hyd yesterday after successfully completing 30 days of shooting in Kashmir.Dont believe such news"
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







